Bharat Jodo Yatra: మహబూబ్నగర్లో జోడో యాత్ర.. గిరిజనులతో కలిసి రాహుల్ నృత్యం..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం మహబూబ్ నగర్ మండల పరిధిలో ప్రారంభమైంది. సినీనటి పూనమ్కౌర్ రాహుల్తో పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
పాలమూరు: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం 6 గంటలకు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్లో ఉన్న జయప్రకాశ్ ఇంజినీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్సింగ్, ఏఐసీసీ సభ్యుడు జైరాం రమేష్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క, సంపత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం సమయంలో 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారిపోడవునా యువకులు, చిన్నారులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్ ముచ్చటించారు. సినీనటి పూనమ్కౌర్ రాహుల్తో పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులు రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ వారితో కలిసి సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం విధించిన జీఎస్టీని తొలగించి.. పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో 3వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు రాహుల్ను కలిసి వర్సిటీల సమస్యలపై వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్