Sachin Pilot: భారత్ జోడో యాత్రలోకి ‘రాజస్థాన్ సీఎం వివాదం’.. సచిన్ పైలట్ అసహనం!
రాజస్థాన్లో జోడో యాత్రను అడ్డుకుంటామని గుర్జర్ నేత చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ స్పందించారు. భాజపా యత్నాలు ఫలించవన్నారు.
జైపుర్: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిని చేయకపోతే.. భారత్ జోడో యాత్రను అడ్డుకుంటామని రాజస్థాన్ నేత విజయ్ సింగ్ భైంస్లా హెచ్చరించారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన వీడియో ద్వారా తమ డిమాండ్ను బయటపెట్టారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సచిన్ పైలట్.. సీఎం వివాదానికి భారత్ జోడో యాత్రతో ఎందుకు ముడిపెడుతున్నారని అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం.
‘ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తిచేసుకుంది. ఇంకా ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు సచిన్ పైలట్ను సీఎం చేయాలి. అది జరిగితే రాష్ట్రంలోకి మీ యాత్రను ఆహ్వానిస్తాం. లేదంటే దానిని అడ్డుకుంటాం’ అని భైంస్లా వ్యాఖ్యానించారు. తమ వర్గం నేతను సీఎంను చేయడమో లేదంటే దీనిపై సమాధానం ఇవ్వడమో చేయాలని రాహుల్ను కోరారు. 2018లో తమ వర్గం నేత ముఖ్యమంత్రి అవుతారని భావించి కాంగ్రెస్కు ఓటేశామన్నారు.
‘ప్రస్తుత ప్రభుత్వంతో 2019, 2020లో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాం. కానీ అవి ఇప్పటివరకు అమలు కాలేదు. ఈ ప్రభుత్వ వైఖరి వల్లే మేం ఈ హెచ్చరికకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది’ అని అన్నారు. రాజస్థాన్ జనాభాలో గుర్జర్ కమ్యూనిటీ వాటా ఐదు నుంచి ఆరు శాతం వరకు ఉంటుంది. 40 సీట్లపై ఆ వర్గం ప్రభావం చూపుతుంది. తూర్పు రాజస్థాన్ వీరి ప్రాబల్యం ఉండగా.. షెడ్యూల్ ప్రకారం అక్కడ కూడా రాహుల్ సారథ్యంలో భారత్ జోడో యాత్ర సాగనుంది. డిసెంబర్ 3నాటికి ఆ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.
భాజపా యత్నం ఫలించదు: పైలట్
కాగా, భైంస్లా వ్యాఖ్యలకు విరుద్ధంగా సచిన్ పైలట్ స్పందించారు. ‘ఈ యాత్రను ఆటంకపరిచేందుకు భాజపా ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేదు. అంతా కలిసి ఈ రాష్ట్రంలోకి జోడో యాత్రను స్వాగతిస్తాం. ఈ పాదయాత్ర కాంగ్రెస్కు కొత్త ప్రారంభం కానుంది’ అని పైలట్ అన్నారు. భారత్ జోడో యాత్ర రాజస్థాన్లో 15 నుంచి 18 రోజుల పాటు సాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!