Congress: రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా, ఆరెస్సెస్ కుట్ర : కాంగ్రెస్
భాజపా, ఆరెస్సెస్లు రహస్య అజెండాతో రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది.
దిల్లీ: రాజ్యాంగంలో మార్పులు చేయడానికి భాజపా (BJP)కు 400 సీట్లు అవసరమని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే (Anantkumar Hegde) చెప్పడాన్ని కాంగ్రెస్ (Congress) తప్పుపట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భాజపాపై విమర్శలు చేశారు. ‘‘రాజ్యాంగంలో మార్పులు చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం, భాజపా, ఆరెస్సెస్లు నియంతృత్వ పాలనను అమలు చేయాలని చూస్తున్నాయి. అదే వారి రహస్య అజెండా. ఎన్నికలు నిర్వహించకుండా, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత’’ అని ఖర్గే ఎక్స్లో పోస్టు చేశారు.
‘‘అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే నరేంద్ర మోదీ లక్ష్యం. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, పౌర హక్కులు వాళ్లకు నచ్చవు. సమాజాన్ని విభజించి.. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కి, నియంతృత్వ పాలనను అమలు చేయాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు ఈ కుట్రను అడ్డుకోవాలి. ఈ పోరాటంలో ఇండియా కూటమి మీకు తోడుగా ఉంటుంది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా ఎంపీ అనంత కుమార్ హెగ్డే శనివారం ఉత్తర కర్ణాటకలోని సిద్ధపూర్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పాలకులు అనవసరమైన మార్పులు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే లోక్సభ, రాజ్యసభలో భాజపాకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉండాలి. అందుకే లోక్సభలో పార్టీకి 400 సీట్లు అవసరం. ఈ ఎన్నికల్లో మీరంతా భాజపాను గెలిపించాలి’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా