AP News: గుడివాడ వెళ్తున్నభాజపా బృందాన్ని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న భాజపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,

Updated : 25 Jan 2022 14:53 IST

గన్నవరం: విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న భాజపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేశ్‌ తదితరులు తమ వాహనాల్లో బయల్దేరగా పోలీసులు అడ్డుతగిలారు. దీంతో గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డురోడ్డు వద్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో సోము వీర్రాజు తదితరులు వారితో వాగ్వాదానికి దిగారు. సంక్రాంతి సంబరాల ముగింపు వేడుకలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.

పోలీసులు అడ్డుకోవడంతో భాజపా నేతలు వాహనాలు దిగి కాలినడకనే గుడివాడ బయల్దేరారు. పలుచోట్ల అడ్డగింతలు ఎదురవుతున్నా.. పోలీసు వలయాలను తప్పించుకుని భాజపా నేతలు ముందుకు సాగుతున్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని