UP Assembly Elections: యూపీలో పొత్తులపై భాజపా కీలక ప్రకటన
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్ పార్టీతో పొత్తు పెట్టుకొని......
నిషద్, అప్నాదళ్తో కలిసి ఎన్నికల బరిలోకి.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన
లఖ్నవూ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అధికార భాజపా కీలక ప్రకటన చేసింది. నిషద్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రమంత్రి, యూపీ ఎన్నికల భాజపా ఇన్ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, నిషద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషద్లు లఖ్నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలూ కలిసే పోటీ చేశాయి. ఈ సందర్భంగా ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘నిషద్ పార్టీతో కలిసి మేం ఎన్నికలకు వెళ్తున్నాం. భాజపా, నిషద్ పార్టీ కలిసి 2022 ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడి శక్తితో కలిసి బరిలోకి దిగుతాయి’’ అన్నారు.
సీట్ల పంపకంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తగిన సమయంలో దీనిపై ప్రకటిస్తామన్నారు. కేవలం నిషద్ పార్టీయే కాకుండా ఇప్పటికే పొత్తులో ఉన్న అప్నాదళ్తో కూడా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు తాము కలిసి పనిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోనే వెళ్తున్నామన్నారు. ఈ ఇద్దరు నేతలపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని.. ప్రజాస్వామ్యంలో విశ్వాసమే ఎంతో ముఖ్యమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?