Telangana News: కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్టు: జేపీ నడ్డా
భాజపా సర్కార్ బాధ్యతాయుతమైనదని.. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం లభించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
మహబూబ్నగర్: భాజపా సర్కార్ బాధ్యతాయుతమైనదని.. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం లభించిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. మోదీ సర్కార్ 130 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందిస్తోందని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలకు కూడా సాధ్యం కానిది మోదీ సర్కార్ చేసి చూపించారని కొనియాడారు. భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన ‘జనం గోస - బీజేపీ భరోసా’ సభలో జేపీ నడ్డా మాట్లాడారు.
‘‘మోదీ సర్కార్ రెండేళ్ల పాటు దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేసింది. దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంపై దేశమంతా సంతోషంగా ఉంది. అయితే ఈ పథకంలో చేరేందుకు కేసీఆర్ మాత్రం నిరాకరించారు. సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కారు భ్రష్టు పట్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం వలే మారింది. కేసీఆర్ పాలనలో ఒక్క ఇంచు భూమికి కూడా కొత్తగా నీరు అందలేదు. అవినీతిలో తెలంగాణ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలో భారీగా అవినీతి జరిగింది. కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ రజాకర్ సమితి. కేసీఆర్ 8 ఏళ్లలో ఎంత మందికి రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారు. ఇళ్ల కోసం కేంద్రం ఇస్తున్న నిధులు కూడా కేసీఆర్ వినియోగించుకోలేకపోయారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉంది’’ అని నడ్డా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila)పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. -
‘క్రిటికల్ రివర్’ కంపెనీ వెనుక ఐటీ సలహాదారు శేషిరెడ్డి
క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ వెనక వైకాపావారు, ఐటీ సలహాదారు పాటూరి శేషిరెడ్డి ఉన్నారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తొలుత రూపొందించింది జగన్ ప్రభుత్వమే
దేశంలో తొలిసారిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించిందే జగన్ ప్రభుత్వం అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లును కేంద్రం తిప్పి పంపినా మూడు సార్లు ఆమోదం కోసం పంపారని గుర్తుచేశారు. -
సీఎస్ను వెంటనే బదిలీ చేయాలి: రఘురామ
రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే సీఎస్నూ వెంటనే బదిలీ చేయాలని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు డిమాండు చేశారు. -
రాముడిని ఆరాధించానని దాడి చేశారు
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడా ఆ పార్టీ ఛత్తీస్గఢ్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాముడి భక్తురాలిని అయినందుకే తనపై దాడి చేశారని సోమవారం ఆమె మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!