భాజపాకు ₹785 కోట్లు.. కాంగ్రెస్కు ₹139 కోట్లు!
కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం, 2019-20 సంవత్సరానికి గానూ భాపాకు రూ.785.77 కోట్లు విరాళంగా వచ్చాయి. కాంగ్రెస్కు రూ.139 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది.
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల నివేదిక
దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం 2019-20 సంవత్సరానికి గానూ భాపాకు ఏకంగా రూ.785.77 కోట్లు విరాళంగా వచ్చాయి. అదే సమయంలో కాంగ్రెస్కు రూ.139 కోట్లు విరాళాలు వచ్చినట్లు పేర్కొంది. కాంగ్రెస్తో పోలిస్తే భారతీయ జనతా పార్టీకి దాదాపు ఐదురెట్లు ఎక్కువగా విరాళాలు రావడం గమనార్హం.
తమకు వచ్చే విరాళాల గురించి రాజకీయ పార్టీలు ఏటా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాయి. ఇందులో భాగంగా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి రూ.785 కోట్లు విరాళంగా వచ్చినట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికలో భాజపా వెల్లడించింది. వీటిలో ఎక్కువగా పార్టీ నేతలు, కార్పొరేట్ సంస్థలు, ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారానే వచ్చాయి. పీయూష్ గోయల్, పెమా ఖాండూ, కిరోణ్ ఖేర్, రమణ్ సింగ్ వంటి పార్టీ నేతలు భాజపాకు విరాళాలు ఇచ్చిన వారిలో ముందున్నారు. ఇక ఐటీసీ, కల్యాణ్ జ్యువెల్లర్స్, రేర్ ఎంటెర్ప్రైజెస్, అంబుజా సిమెంట్, లోధా డెవలపర్స్, మోతీలాల్ ఓస్వాల్ వంటి కార్పొరేట్ సంస్థలూ భాజపాకు నిధులు సమకూర్చాయి. కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా రూ.139 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది. ఎన్సీపీ రూ.59 కోట్లు, సీపీఐ(ఎం) రూ.19.7కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ.8 కోట్లు, సీపీఐ రూ.1.3 కోట్లు విరాళంగా అందుకున్నట్లు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ