ఉద్యోగాల్లో మహిళలకు కోటా.. సీఏఏ అమలు
పశ్చిమ బెంగాల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ‘సోనార్ బంగ్లా సంకల్ప్ పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ సీనియర్....
పశ్చిమ బెంగాల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఓటర్లపై హామీల వర్షం కురిపించింది. ‘సోనార్ బంగ్లా సంకల్ప్ పత్ర’ పేరిట ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఇక్కడ పార్టీ నేతలతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు, పీఎం కిసాన్ అరియర్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పే కమిషన్.. అంటూ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా హామీలను భాజపా తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే ఏడో పే కమిషన్ వర్తింపజేస్తామని భాజపా హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొంది. పీఎం- కిసాన్ అరియర్స్ను రూ.18వేల చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కోసం తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదముద్ర వేస్తామని పేర్కొంది. 70 ఏళ్లుగా రాష్ట్రంలో నివాసముంటున్న శరణార్థులకు పౌరసత్వం కల్పించడంతో పాటు ఏటా రూ.10వేలు చొప్పున ఐదేళ్ల పాటు నగదు బదిలీ చేస్తామని హామీ ఇచ్చింది.
మరిన్ని హామీలు..
* మహిళలకు కేజీ టు పీజీ ఉచిత విద్య
* రాష్ట్రంలో మూడు ఎయిమ్స్ల ఏర్పాటు
* ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు
* ముఖ్యమంత్రి కార్యాలయంలో అవినీతి నిరోధానికి హెల్ప్లైన్
* ₹11వేల కోట్లతో సోనార్ బంగ్లా నిధి ఏర్పాటు
* బెంగాల్లోకి చొరబాట్లు లేకుండా కంచెల కట్టుదిట్టం
* అంతర్జాతీయంగా బెంగాలీ భాష గుర్తింపునకు కేంద్రం తన వంతు కృషి
* నోబెల్ బహుమతి తరహాలో ఠాగూర్ బహుమతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?