Andhra News: కుప్పంపై సీఎం జగన్‌ కక్ష కట్టారు: చంద్రబాబు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే ఎక్కువని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్‌, డీజిల్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు...

Published : 12 May 2022 01:35 IST

కుప్పం: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏపీలోనే ఎక్కువని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్‌, డీజిల్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కుప్పంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కక్ష కట్టారని విమర్శించారు. నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన అంశంపై చంద్రబాబు స్పందించారు. ‘‘నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి మంచి చదువు అందుతోంది. అలాంటి విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నారాయణ విద్యా సంస్థల బాధ్యతల నుంచి నారాయణ తప్పుకున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్టు చేశారు. 43 ఏళ్లు కష్టపడి విద్యాసంస్థలను నారాయణ నిర్మించారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని