Andhra News: కుప్పంపై సీఎం జగన్ కక్ష కట్టారు: చంద్రబాబు
పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు...
కుప్పం: పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. కుప్పంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కక్ష కట్టారని విమర్శించారు. నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను పట్టించుకునేవారు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసిన అంశంపై చంద్రబాబు స్పందించారు. ‘‘నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి మంచి చదువు అందుతోంది. అలాంటి విద్యాసంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నారాయణ విద్యా సంస్థల బాధ్యతల నుంచి నారాయణ తప్పుకున్నారు. కేవలం రాజకీయ కక్షతోనే నారాయణను అరెస్టు చేశారు. 43 ఏళ్లు కష్టపడి విద్యాసంస్థలను నారాయణ నిర్మించారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?