ద్రవ్యోల్బణమా.. తినడం, పెట్రోల్ కొనడం మానేయండి!
ఒకవైపు పార్టీని దేశమంతా విస్తరింపజేసేందుకు భాజపా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటే.. మరోకవైపు సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాషాయ పార్టీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ గురువారం మీడియాతో
ఛత్తీస్గఢ్ భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
రాయపూర్: ఒకవైపు పార్టీని దేశమంతా విస్తరింపజేసేందుకు భాజపా అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటే.. మరొకవైపు సొంత పార్టీ నేతలే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాషాయ పార్టీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ద్రవ్యోల్బణం పెరుగుదల జాతీయ విపత్తని భావించేవాళ్లు తినడం.. పెట్రోలు వినియోగించడం మానేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీకి ఓటు వేసినవారు ఈ పని చేస్తే ద్రవ్యోల్బణం తగ్గుతుంది’’ అని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో వివాదాస్పదంగా మారాయి.
దీంతో బ్రిజ్మోహన్ ఇవాళ మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ‘‘రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ద్రవ్యోల్బణాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించారు. అలాంటప్పుడు కాంగ్రెస్ శ్రేణులు తినడం, పెట్రోల్ వాడకం మానేస్తే అది తగ్గుతుందని సరదాగా అన్నాను. అంతేకానీ, ప్రజలందరినీ తినడం, ఇంధనం ఉపయోగించడం మానేయమని చెప్పలేదు’’ అని వివరణ ఇచ్చుకున్నారు. కాగా బ్రిజ్మోహన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఎవరైనా కేంద్రాన్ని వ్యతిరేకిస్తే దేశం వదిలి వెళ్లిపొమ్మంటారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?