TS News: కేసీఆర్ దిల్లీ మంతనాలు ఏంటి?: భట్టి విక్రమార్క
కాంగ్రెస్, భాజపా హుజూరాబాద్ ఎన్నికల్లో కలిసిపోయాయని మంత్రి కేటీఆర్ మాట్లాడటం సరికాదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
హైదరాబాద్: కాంగ్రెస్, భాజపా హుజూరాబాద్ ఎన్నికల్లో కలిసిపోయాయని మంత్రి కేటీఆర్ మాట్లాడటం సరికాదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
‘‘భాజపా మతతత్వ పార్టీ, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. రెండూ భిన్న ధృవాలు. కేటీఆర్కు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలో ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈటలను గెలిపించడం కోసం కాంగ్రెస్ ఎందుకు పనిచేస్తుంది. తెరాస, భాజపాల మధ్య లోపాయకారీ ఒప్పందాలు ఉన్నాయి. ఈటల అవినీతిపై ప్రభుత్వం విచారణ ఎటుపోయింది. కేసీఆర్ దిల్లీ మంతనాలు ఏంటి? తెరాసను భాజపాలో కలిపే మంతనాలు జరిగాయా? రాష్ట్రంలో ప్రజా సమస్యలు టీఆర్ఎస్కు పట్టడం లేదు. కాంగ్రెస్ నాయకులపై బురద జల్లితే ప్రజలు నమ్మరు. గాంధీభవన్లో గాడ్సేలు ఉండరు... కాంగ్రెస్ భావజాలం ఉన్న వారే ఉంటారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడటం సరికాదు. ఎన్నికల తర్వాత ఈటల కాంగ్రెస్లోకి వస్తారనడం ఊహాజనితం. దళితబంధుపై భాజపా వైఖరి సరిగా లేదు. దళితబంధును ఆపడంలో భాజపా, తెరాస పాత్ర ఉంది. ఇద్దరు దొంగలు కలిసి దళితబంధును ఆపారు. బల్మూర్ వెంకట్ బలమైన అభ్యర్థి. కాదని ఎవరన్నా అంటే అది వారి అవగాహనా రాహిత్యం. హైదరాబాద్ నిండా తెరాస ప్లెక్సీలతో నింపారు. ప్రతిపక్షాల ప్లెక్సీలు పెడితే హడావుడిచేసే అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’ అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం