CM Revanth: హైదరాబాద్ నలువైపులా ఒకేవిధమైన అభివృద్ధి: సీఎం రేవంత్రెడ్డి
మెట్రో రైలు, ఐటీ కంపెనీలు మేడ్చల్కు రావాలంటే మల్కాజిగిరి ఎంపీ సీటు కాంగ్రెస్ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: మెట్రో రైలు, ఐటీ కంపెనీలు మేడ్చల్కు రావాలంటే మల్కాజిగిరి ఎంపీ సీటు కాంగ్రెస్ గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం మేడ్చల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజాదీవెన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
‘‘కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్కు అధికారం దక్కింది. ప్రజల తరఫున పోరాడినందుకే సంపూర్ణమైన మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు అంటున్నారు. దోచుకుని దాచుకున్న సొమ్ముతో ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే మొనగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా? మహిళా రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే ఇవాళ ధర్నా చేస్తున్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే భయపడుతున్నారు.
పిల్లర్లు కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఇవ్వాలని పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతోక తగిలి కూలినట్టుగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు అరవై ఏళ్లు అయినా చెక్కు చెదరలేదు. కేసీఆర్ తన ఫామ్హౌజ్లో కట్టిన ఇల్లు మూడేళ్లకే కూలిపోయేలా కట్టారా? ఇప్పుడున్న మెట్రో లైన్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందే. పదేళ్లలో కొత్తగా ఒక్క కిలోమీటర్ కూడా మెట్రో మార్గాన్ని పొడిగించలేదు. హైదరాబాద్ నాలుగు వైపులా ఒకే విధంగా అభివృద్ధి జరగాలి. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?