Congress manifesto: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో యువతకు ‘ఉపాధి హక్కు’?
Congress manifesto: యువ ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పలు కీలక హామీలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఉపాధి హక్కు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యల వంటి అంశాలను అందులో చేర్చనున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల హామీల్లో ఉపాధి హక్కును చేర్చనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పరీక్ష పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాన్ని తీసుకొస్తామని యువతకు భరోసా ఇవ్వనున్నట్లు వెల్లడించాయి. ఈ అంశాలను మ్యానిఫెస్టోలో (Congress manifesto) చేర్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
మధ్యప్రదేశ్లోని బదనావర్లో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హాజరుకానున్నారు. ఈ సభలో ‘ఉపాధి హక్కు’పై ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలో ఖరారు చేయనున్న మ్యానిఫెస్టోలో ఇవన్నీ ఉంటాయని వెల్లడించాయి. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం ఇదే తొలిసారని.. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇటువంటివి లేవని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. నిరుద్యోగ యువతకు కొంత భృతిని కూడా ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత తీసుకురావాలని పార్టీ యోచిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా దేశంలో ప్రశ్నపత్రాల లీకేజీలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఓ చట్టాన్ని తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల వ్యవహారాన్ని ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా రాహుల్ గాంధీ గమనించారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీని వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నట్లు గ్రహించారని వివరించాయి. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నాయి. యాత్ర సందర్భంగా కాంగ్రెస్ (Congress) వాగ్దానం చేసిన ‘న్యాయానికి ఐదు స్తంభాలు’ ఆధారంగానే మ్యానిఫెస్టో ఉంటుందని వెల్లడించాయి. ‘కనీస మద్దతు ధర’కు చట్టబద్ధత, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీ, కులగణన, అణగారిన వర్గాలకు ఆర్థిక సాయం వంటి హామీలూ ఉంటాయని తెలిపాయి.
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం నేతృత్వంలోని కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో ఎన్నికల ప్రణాళికకు ఓ తుదిరూపు ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ముసాయిదా రూపంలో ఉన్న మేనిఫెస్టోకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపాక ప్రజల్లోకి తీసుకొస్తామని చిదంబరం తెలిపారు.
ఉద్యోగ నియామకాల ప్రశ్నపత్రాల లీకేజీలతో యువత తీవ్ర ఇబ్బందులు పడుతోందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారదర్శకతతో ఖాళీల భర్తీ జరిగేలా చూస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మంగళవారం భరోసా ఇచ్చారు. విద్యార్థుల భవితతో ఆటలాడుకునేందుకు ఎవరినీ అనుమతించేదే లేదన్నారు. యూపీ సహా దేశంలో అన్నిచోట్లా పేపర్ల లీకేజీలు నిత్యకృత్యమయ్యాయని ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే