Uttar Pradesh: యూపీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్.. ప్రచార ర్యాలీలను రద్దు చేసిన కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్లే కన్పిస్తోంది. యూపీ వ్యాప్తంగా చేపట్టాల్సిన అన్ని ప్రచార ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ బుధవారం
నోయిడా సభను రద్దు చేసుకన్న యోగి ఆదిత్యనాథ్
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినట్లే కన్పిస్తోంది. యూపీ వ్యాప్తంగా చేపట్టాల్సిన అన్ని ప్రచార ర్యాలీలను రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతుండటంతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పలువురు రాజకీయ నాయకులు కూడా వైరస్ బారినపడటంతో హస్తం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడా ర్యాలీని రద్దు చేసుకున్నారు. నోయిడాలో గురువారం సీఎం ప్రచారం చేపట్టాల్సి ఉండగా.. అక్కడ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ లాగే బాజపా కూడా అన్ని ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలను రద్దు చేస్తుందా లేదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
ఒమిక్రాన్ వ్యాప్తితో దేశంలో మూడో దశ ముప్పు పొంచి ఉన్న వేళ.. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలు సూపర్ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు పలువురు రాజకీయ పార్టీల నేతలు ఇటీవల కరోనా బారినపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సుర్జేవాలాకు మంగళవారం వైరస్ పాజిటివ్గా తేలింది. పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా తన సిబ్బందికి కరోనా సోకడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. బరేలీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిన్న చేపట్టిన మారథాన్ కార్యక్రమంలో అవాంచనీయ ఘటన చోటుచేసుకుంది. ఈ పరుగు పందెంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీదారులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే మారథాన్లో పాల్గొన్న అమ్మాయిల్లో చాలా మంది మాస్క్లు ధరించకపోవడం, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.