Congress: అర్థం కాకపోతే స్కూల్కెళ్లి చదువుకో: పీకేపై సల్మాన్ ఖుర్షిద్ మండిపాటు
విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన హక్కు ఏమీ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన
దిల్లీ: విపక్ష కూటమికిగానీ, కాంగ్రెస్కుగానీ అధ్యక్షత వహించడం ఒక వ్యక్తికి దేవుడు ఇచ్చిన హక్కు ఏమీ కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్ష నాయకత్వాన్ని నిర్ణయించుకోవాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో జాతీయ రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ప్రశాంత్ కిషోర్కి ప్రజాస్వామ్యం గురించి తెలియకపోతే పాఠశాలకెళ్లి చదువుకోవాలని హితవు పలికారు.
‘‘ప్రజాస్వామ్యం పట్ల పీకే(ప్రశాంత్ కిషోర్)కి చాలా ఆసక్తి ఉన్నట్లు ఉంది. కాంగ్రెస్ కార్యకర్తల ప్రజాస్వామిక ఎంపికను ప్రశ్నించేందుకు ఆయన దైవత్వాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి రాజకీయాలకు సంబంధించిన పుస్తకాలు చదివి తెచ్చుకున్న జ్ఞానం మానవ ప్రవర్తనను ప్రభావితం చేయదని అర్థమవుతోంది. రాజకీయం అంటే ఎన్నికల్లో గెలవడమే మాత్రమే కాదు. ఈ విషయం వ్యాపారం చేసే వాళ్లకు ఎలా తెలుస్తుంది?’’అని సల్మాన్ ఖుర్షిద్ విమర్శించారు. దైవత్వం, ప్రజాస్వామ్యం అనేవి విశ్వాసానికి సంబంధించినవని, ప్రజాస్వామ్యాన్ని ఇతరులెవరూ నిర్వచించలేరని సల్మాన్ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కాకపోతే, పాఠశాలకెళ్లి మళ్లీ చదువుకోవడం ప్రారంభించాలని ప్రశాంత్ కిషోర్కు సల్మాన్ సూచించారు.
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా పీకే ట్వీట్పై ట్విటర్లోనే స్పందించారు. ‘‘సిద్ధాంతాల పట్ల ఎలాంటి నిబద్ధత లేకుండా రాజకీయమే వృత్తిగా గల ఓ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే విషయాలపై ఎవరికైనా సలహాలు ఇచ్చుకోవచ్చు. కానీ, మన రాజకీయాలు ఎలా ఉండాలో ఆయన నిర్ణయించలేరు. ఆర్ఎస్ఎస్ నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్గాంధీ ‘దైవిక కర్తవ్యా’న్ని నిర్వహిస్తున్నారు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!