Jaggareddy: జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్న సీనియర్‌ నేతలు.. 22న దిల్లీకి

కాంగ్రెస్‌ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతోంది. పార్టీని వీడనున్నట్టు ప్రకటించిన జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు..

Updated : 19 Feb 2022 22:11 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతోంది. పార్టీని వీడనున్నట్టు ప్రకటించిన జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు ప్రయత్నాలు  ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నివాసంలో జగ్గారెడ్డితో సీనియర్‌ నేతలు గీతారెడ్డి, సంపత్‌ కుమార్‌ తదితరులు సమావేశమయ్యారు. ఈనెల 22న దిల్లీలో రాహుల్‌ గాంధీ వద్దకు తీసుకెళ్తామని జగ్గారెడ్డికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. రాహుల్‌ గాంధీని కలిసిన తర్వాత జగ్గారెడ్డి తన నిర్ణయం మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.

పీసీసీ అధ్యక్షుడిని గౌరవించాలి: మాణికం ఠాగూర్‌
టీపీసీసీ నేతలు ఎవరూ మీడియా ముందు పార్టీ అంశాలు మాట్లడవద్దని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ సూచించారు. రాష్ట్ర పార్టీ నేతలు పీసీసీ అధ్యక్షుడిని గౌరవించాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అధిష్ఠానంతో చెప్పాల్సినవి మీడియా ద్వారా మాట్లాడవద్దని పార్టీ నేతలను కోరారు. అందరూ కలిసి ఉంటేనే 2023 ఎన్నికల్లో గెలుపు సాధ్యపడుతుందని హితవు పలికారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతున్న సమయంలో ఠాగూర్ ట్వీట్‌ చేయడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని