Purandeswari: పొత్తులు సహా ఏ నిర్ణయమైనా అధిష్ఠానమే తీసుకుంటుంది: పురందేశ్వరి
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేసింది.
విజయవాడ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై భాజపా కసరత్తు చేసింది. 2 రోజుల పాటు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ అధ్యక్షతన సమీక్ష చేపట్టారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, మధుకర్ సమక్షంలో ఆశావహులు, పార్టీ నేతలతో ముఖాముఖిలు నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించారు. సుమారు 2 వేల దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆశావహుల బలాబలాలపై స్క్రీనింగ్ కమిటీ బేరీజు వేసింది. ఆదివారం 11 లోక్సభ నియోజకవర్గాల ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులతో సమీక్షలు జరిపారు. ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం నేతలతో ముఖాముఖిలు నిర్వహించారు. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. సమావేశాల్లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. వివిధ అంశాలపై చర్చించి సమీక్షించుకున్నామని తెలిపారు. తాము సేకరించిన విషయాలను క్రోడికరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తామన్నారు. దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తారని వెల్లడించారు. పొత్తులు సహా ఏ నిర్ణయం అయినా పార్టీ అధిష్ఠానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. -
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
Prajwal Revanna: కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారిన లైంగిక దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొచ్చేందుకు సిట్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు: జీవీ రెడ్డి
ప్రజల ఆస్తులు దోచుకోవడానికే వైకాపా ప్రభుత్వం.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. -
నెలకు రూ.9 వేల కోట్ల సంపద సృష్టించలేక అప్పులపాలు
ప్రతి నెల రూ.9 వేల కోట్ల సంపద సృష్టించడం చేతకాని సీఎం జగన్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
జగన్ను ఎందుకు అరెస్టు చేయరు?
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై కక్ష గట్టి అరెస్టు చేయించిన కేంద్రంలోని భాజపా ప్రభుత్వం.. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి ఎందుకు మినహాయింపు ఇస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, మాజీ రాజ్యసభ సభ్యులు పి.మధు ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన