Dhulipalla Narendra: కేంద్రానికి వైకాపా ప్రభుత్వం దాసోహం: ధూళిపాళ్ల నరేంద్ర

రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రైతులను కులాల పేరుతో వైకాపా ప్రభుత్వం ...

Published : 17 May 2022 01:56 IST

అమరావతి: రాష్ట్రంలో రైతుభరోసా పేరుతో ఇతర పథకాలను ఆపేశారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రైతులను కులాల పేరుతో వైకాపా ప్రభుత్వం విభజిస్తోందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరేంద్ర మాట్లాడారు. రైతులను బాదే కార్యక్రమం తప్ప.. వాళ్లను బాగుచేసే పని ఒక్కటీ ఈ ప్రభుత్వం చేయడం లేదని ఆయన విమర్శించారు. 

వ్యవసాయ మీటర్లు పెట్టబోమని పక్కనే ఉన్న తెలంగాణ తేల్చిచెప్పిందని.. వైకాపా ప్రభుత్వం మాత్రం కేంద్రానికి దాసోహమైందని ధూళిపాళ్ల నరేంద్ర ఆక్షేపించారు. మీ స్వార్థం కోసం రైతులను ఎందుకు బలి చేస్తారని వైకాపా నేతలను ఆయన ప్రశ్నించారు. రైతుల మెడపై కత్తిపెట్టి మీటర్లు పెట్టడం ఎందుకు? రాయితీ ఇవ్వడం ఎందుకు? అని నరేంద్ర నిలదీశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎత్తేసేందుకు కుట్రలా ఇది కనబడుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని