34 మందితో తమిళనాడు మంత్రివర్గం
తాజా ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల విజయం సాధించిన డీఎంకే స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ కూడా సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు...
ప్రకటన విడుదల చేసిన డీఎంకే
చెన్నై: తమిళనాడు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన డీఎంకే పార్టీ నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మొత్తం 234 స్థానాలకు గానూ 133 చోట్ల విజయం సాధించిన డీఎంకే స్టాలిన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తాజాగా 34 మంది మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు డీఎంకే గురువారం ప్రకటన విడుదల చేసింది. వీరంతా శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే కీలక శాఖలను మాత్రం స్టాలిన్ తనవద్దే ఉంచుకున్నట్లు సమాచారం. హోంశాఖతో పాటు సంక్షేమశాఖ, జనరల్ అడ్మినిష్ట్రేషన్ తదితర పోర్టుఫోలియోలను స్టాలిన్ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల నియామకాలు, బదిలీలను కూడా ఆయనే పర్యవేక్షిస్తారు. మరోవైపు స్టాలిన్ తనయుడు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధికి మాత్రం తాజా మంత్రుల జాబితాలో స్థానం దక్కలేదు. అయితే భవిష్యత్లో మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? ఇదే మంత్రులు ఉంటారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?