దుబ్బాక: 7వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా..

Updated : 10 Nov 2020 12:20 IST

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. తొలి ఐదు రౌండ్లలో భాజపా ఆధిక్యం ప్రదర్శించగా.. 6, 7వ రౌండ్లలో లో తెరాసకు ఆధిక్యం లభించింది. ఏడో రౌండ్‌ ముగిసే సరికి భాజపా 2,485 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ప్రస్తుతం దుబ్బాకలో ఏడు రౌండ్లు ముగిసే సరికి  భాజపాకు 22,762, తెరాసకు 20,277 కాంగ్రెస్‌కు 4,003 ఓట్లు లభించాయి. ఇంకా 16 రౌండ్ల ఓట్లు లెక్కింపు పూర్తి చేయాల్సి ఉంది. ఏడో రౌండ్‌లో మిర్‌దొడ్డి మండలంలో ఓట్లు లెక్కించగా..తెరాసకు 2,718, భాజపాకు 2,536, కాంగ్రెస్‌కు 749 ఓట్లు పోలయ్యాయి.

 23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరి కాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్‌-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్‌ నమోదైంది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని