ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవు: ఈసీ

కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు

Updated : 21 Dec 2022 15:53 IST

దిల్లీ: కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండవని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గేవరకు ఏపీ, తెలంగాణలోని 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరపలేమని వెల్లడించింది. ఈ మేరకు ఈసీ ప్రకటన విడుదల చేసింది. పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే నిర్వహిస్తామని తెలిపింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ లేఖపై చర్చించిన ఈసీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించరాదనే అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణలో 6, ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని