Aroori Ramesh: భాజపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు.
హైదరాబాద్: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆయనకు కాషాయ కండువా కప్పి ఆహ్వానించారు. భారాస వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రమేశ్.. శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. భారాసను వీడనున్నారనే ప్రచారం తర్వాత ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ముఖ్యనేతలు ఆయన్ను బుజ్జగించారు. అధినేత కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి సముదాయించినా ఫలితం లేకపోయింది. అరూరి రమేశ్ భాజపా తరఫున వరంగల్ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశముంది. ఈ మేరకు ఆ పార్టీ నుంచి ఆయనకు హామీ లభించినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
ప్రజా పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం మేడే అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?
-
తమిళనాడు క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి