Congress: గాంధీ కుటుంబం ఆశీస్సులు మా ఇద్దరికీ ఉన్నాయ్: థరూర్
కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నిక తేదీ దగ్గరపడుతుండటంతో అధ్యక్ష బరిలో నిలిచిన మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు.
ముంబయి: కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎన్నిక తేదీ దగ్గరపడుతుండటంతో అధ్యక్ష బరిలో నిలిచిన మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన తమ ఇద్దరికీ గాంధీ కుటుంబం ఆశీస్సులు ఉన్నాయని.. ఎవరిపట్లా పక్షపాతం లేదన్నారు. 2024 ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ఖర్గేను అధికారిక అభ్యర్థిగా, తనను అనధికారిక అభ్యర్థిగా పేర్కొంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
2024 తర్వాత భాజపా ప్రతిపక్షానికే పరిమితమవుతుందని.. అందుకు ఆ పార్టీ సన్నద్ధంగా ఉండాలని థరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలోనూ మార్పులు అవసరమన్న ఆయన.. ఆ మార్పునకు తానొక ఉత్ప్రేరకంగా ఉంటానని భావిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని చక్కగా నడిపించిందని.. ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓటర్ల విశ్వాసాన్ని గెలిపించాలన్నారు. ఈ సమావేశానికి మహారాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నానా పటేలో హాజరు కాలేదు. దీనిపై థరూర్ స్పందిస్తూ.. నానా పటోలేతో తాను మాట్లాడానని.. ఆయనకు ముందే వేరే పని ఉండటం వల్లే హాజరుకాలేదని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!