విశాఖపై జగన్ రహస్య జీవోలిస్తున్నారు: ఉమా
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన అనుచరులు విశాఖలో భూదందాలు జరుపుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. బలవంతంగా భూములు లాక్కుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని
విజయవాడ: రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఆయన అనుచరులు విశాఖలో భూదందాలు జరుపుతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. బలవంతంగా భూములు లాక్కుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో కలిసి దేవినేని మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధానిని విశాఖకు తరలించేందుకు యత్నిస్తున్నారన్నారు. దీనికోసం రహస్య జీవోలు సైతం ఇస్తున్నారని ఆరోపించారు. ఆ ఉత్తర్వులపై సంతకాలు చేసే ముందు అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఫొటోను ముందు ఉంచుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమాలకు సహకరించే అధికారులు మున్ముందు సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని దేవినేని హెచ్చరించారు.
దళితులు చైతన్యం లేనివారు కాదు
రాజధాని అమరావతిలో గతంలో తెదేపా ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని పేర్కొంటున్న వైకాపా నేతలు, మంత్రులు అందుకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని మాజీ మంత్రి జవహర్ డిమాండ్ చేశారు. దళితుల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని దళితులు చైతన్యం లేని వారు కాదన్నారు. ఒకవేళ అదే జరిగితే తాను దళితుల తరఫున ముందుండి పోరాడుతానని తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన భార్య పేరిట కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నిజాలు మాట్లాడకుండా.. ‘నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ’ చిలక పలుకులు పలుకుతున్నారని జవహర్ విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..