రూల్154 ప్రకారం ఛైర్మన్ నిర్ణయం:యనమల
శాసన మండలి ఛైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా.. ఛైర్మన్ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీ సిఫార్సు...
అమరావతి: శాసన మండలి ఛైర్మన్కు విచక్షణాధికారం ఉంటుందని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కొన్ని పొరపాట్లు జరిగినా.. ఛైర్మన్ నిర్ణయమే అంతిమం అని చెప్పారు. శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీ సిఫార్సు చేస్తూ ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయంపై యనమల హర్షం వ్యక్తం చేశారు. మండలి వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభలోనూ బిల్లులు ప్రవేశపెట్టే విషయంలో ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని ఆరోపించారు. శాసనసభలో స్పీకర్కు నిబంధనలు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. రాజధాని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే బిల్లులను ఆమోదించుకుని ఎలా వెళ్తారని ఆయన మండిపడ్డారు. బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్తే ప్రభుత్వానికున్న ఇబ్బందేమిటిని దుయ్యబట్టారు. నిబంధన 154 ప్రకారం మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని తాము వ్యతిరేకించామని చెప్పారు. ఛైర్మన్ షరీఫ్పై వైకాపా సభ్యుల దాడి చేసేందుకు యత్నించారని.. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నారా లోకేశ్పై మంత్రి అనిల్ దాడి చేసే ప్రయత్నం చేశారని యనమల ఆరోపించారు.
జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది: బుద్ధా
బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లాలని ప్రయత్నించిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. వైకాపా సభ్యులు మండలి ఛైర్మన్ షరీఫ్ను బెదిరించాలని చూశారని ఆరోపించారు. అయినా ఆయన బెదిరింపులకు లొంగలేదన్నారు. ఛైర్మన్ను ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యక్తిగతంగా దూషించారని బుద్ధా ఆరోపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు భగవంతుడు కూడా ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఇవాల్టి నుంచి జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?