కేకేతో ఎలా ఓటు వేయిస్తారు?:లక్ష్మణ్
పురపాలిక ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా...
హైదరాబాద్: పురపాలిక ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. పార్టీ ప్రతినిధుల బృందంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసిన లక్ష్మణ్ రాజ్భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చి రాష్ట్రంలో రాజకీయాలంటేనే అసహ్యించుకునే రీతిలో తయారు చేశారని విమర్శించారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో భాజపాకు స్పష్టమైన మోజారిటీ ఉన్నప్పటికీ ఎక్స్ అఫీషియో సభ్యులతో ఓటింగ్ వేయించి ఛైర్మన్ పదవి దక్కకుండా తెరాస అక్రమాలకు పాల్పడిందన్నారు. ఆంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తెలంగాణలో ఎలా ఓటు వేస్తారని లక్ష్మణ్ ప్రశ్నించారు. తుక్కుగూడలో తెరాస వ్యవహరించిన తీరు.. పురపాలక ఎన్నికల్లో అధికార దుర్వినియోగంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు లక్ష్మణ్ వివరించారు. ఫిబ్రవరి 1వ తేదిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసి కేశవరావుపై ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు