నాకూ బర్త్ సర్టిఫికేట్ లేదు: కేసీఆర్
తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు...
హైదరాబాద్: తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన సీఏఏ, ఎన్పీఆర్పై స్పందించారు.
‘సీఏఏ, ఎన్పీఆర్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై సభలో ఒకరోజు ప్రత్యేక చర్చ చేపట్టాలి. నేను మా ఊరిలో సొంతింటిలో పుట్టాను. మా ఊరిలో అప్పుడు ఆస్పత్రి లేదు. నాకు బర్త్ సర్టిఫికెట్ కూడా లేదు. నాకే ధ్రువీకరణ పత్రం లేదంటే.. మా నాన్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కోరినట్లు సీఏఏపై ప్రత్యేకంగా చర్చిద్దాం.’ అని సీఎం పేర్కొన్నారు.
‘సీఏఏ బిల్లును పార్లమెంట్లో మేం వ్యతిరేకించాం. శాసనసభలో దీనిపై చర్చ జరగాల్సిందే. మన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కానీ, దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభ చర్చించాల్సిన అవసరముంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 40మందికి పైగా మంది చనిపోయారు. మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం