నాకూ బర్త్‌ సర్టిఫికేట్‌ లేదు: కేసీఆర్‌

తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు...

Updated : 07 Mar 2020 19:24 IST

హైదరాబాద్‌: తమ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన సీఏఏ, ఎన్‌పీఆర్‌పై స్పందించారు.

‘సీఏఏ, ఎన్‌పీఆర్‌పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై సభలో ఒకరోజు ప్రత్యేక చర్చ చేపట్టాలి. నేను మా ఊరిలో సొంతింటిలో పుట్టాను. మా ఊరిలో అప్పుడు ఆస్పత్రి లేదు. నాకు బర్త్‌ సర్టిఫికెట్‌ కూడా లేదు. నాకే ధ్రువీకరణ పత్రం లేదంటే.. మా నాన్న సర్టిఫికెట్‌ ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కోరినట్లు సీఏఏపై ప్రత్యేకంగా చర్చిద్దాం.’ అని సీఎం పేర్కొన్నారు.

‘సీఏఏ బిల్లును పార్లమెంట్‌లో మేం వ్యతిరేకించాం. శాసనసభలో దీనిపై చర్చ జరగాల్సిందే. మన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్నది వేరే విషయం. కానీ, దేశాన్ని కుదిపేస్తున్న ఈ అంశంపై శాసనసభ చర్చించాల్సిన అవసరముంది. దేశ రాజధాని దిల్లీలో జరిగిన అల్లర్లలో సుమారు 40మందికి పైగా మంది చనిపోయారు. మన రాష్ట్ర ప్రజల మనోభావాలు, వారి ఆలోచనలను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని