‘వారిని కలిసే వరకూ దీక్ష కొనసాగిస్తా’
భాజపా చెరలో ఉన్న మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలను కలవనిచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘బెంగళూరు పోలీసులు మమ్మల్ని స్థానిక డీసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు.
బెంగళూరు: భాజపా చెరలో ఉన్న మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలను కలిసేంత వరకూ తన దీక్ష కొనసాగిస్తానని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘బెంగళూరు పోలీసులు మమ్మల్ని అరెస్టు చేసి స్థానిక డీసీపీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రమదా హోటల్లో భాజపా చెరలో ఉన్న ఎమ్మెల్యేలను తప్పనిసరిగా కలుస్తాం. వారిని కలవడానికి అనుమతి ఇచ్చేంత వరకూ దీక్ష కొనసాగిస్తా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. నియంతృత్వంలో కాదు’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
బుధవారం తెల్లవారుజామున కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరుకు చేరుకోవడంతోనే హైడ్రామా మొదలైంది. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఉన్న రమదా హోటల్కు వెళ్లి వారిని కలిసేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి..
కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అరెస్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.