ప్రైవేటుఉద్యోగులకు భరోసా కల్పించండి:సంజయ్
రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు. లాక్డౌన్తో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ధాన్యం...
ఆ మేరకు ప్రభుత్వం ప్రకటన చేయాలి
ధాన్యం కొనుగోలు బస్తాలను త్వరగా అందించాలి
సీఎస్తో ఫోన్లో మాట్లాడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోరారు. లాక్డౌన్తో రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కోసం బస్తాలను త్వరగా అందించాలని.. లోడింగ్, అన్లోడింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల డ్రా విధానం, మరికొన్ని చోట్ల టోకెన్ విధానం అమల్లో ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని.. ఒకే విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి పంటకు రూ. 1,835 మద్దతు ధర కల్పించినప్పటికీ సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మేస్తున్నారని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. కందులు కొనుగోలు చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో తక్షణమే నగదు జమచేయాలని.. కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వం పేదలకు రాయితీపై అందించాలని కోరారు.
అత్యవసర సేవలకు ఫీల్డ్ అసిస్టెంట్స్ని తీసుకోండి..
రేషన్ పంపిణీలో అధికారులకు కింది స్థాయి ఉద్యోగులు పూర్తి వివరాలు అందించకపోవడంతో గందరగోళం నెలకొందని సంజయ్ అన్నారు. లాక్డౌన్ కాలంలో అత్యవసర సేవల కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్ను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. విడతల వారీగా భాజపా కార్యకర్తలు పేదలు, కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారని.. వారికి ఎలాంటి ఇబ్బందిల లేకుండా పంపిణీకి అనుమతించాలని సీఎస్ని ఆయన కోరారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ వద్ద వలస కూలీలను ఓ పోలీస్ అధికారి అడవిలో వదిలిరావడం దారుణమన్నారు.
ప్రైవేటు ఉద్యోగులకు భరోసా కల్పించండి..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా కలిగేలా ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని బండి సంజయ్ సీఎస్ను కోరారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు భాజపా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై లిఖితపూర్వకంగా లేఖ ద్వారా వివరాలు అందిస్తానని సీఎస్కు సంజయ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ