అమరావతే రాజధానిగా ఉండాలి: రఘురామకృష్ణరాజు

ఏపీ రాజధాని అమరావతి అంశంపై నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ..

Published : 04 Jul 2020 13:30 IST

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి అంశంపై నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  అమరావతికి పర్యావరణ సానుకూలతలు ఎన్నో ఉన్నాయని, పాలనా రాజధానిగా అమరావతి ఉండటమే సమంజసమని రఘురామకృష్ణరాజు అన్నారు. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం పార్టీ నిర్ణయం కాదని.. ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. జగన్‌ కూడా శాసనసభలో అమరావతికి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. పార్టీ పరంగా ఎన్నడూ అమరావతిని వ్యతిరేకించలేదన్నారు.

 అమరావతిలో ఇప్పటికే 80శాతం పనులు పూర్తయ్యాయని, అవసరమైన వసతులన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. కరోనా సంక్షోభంలో డబ్బు వృథా చేయడం సరికాదన్నారు. వికేంద్రీకరణ తప్పనిసరి అయితే అమరావతిని పరిపాలనా రాజధాని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతికే మద్దతుగా ఉన్నారనేది తన విశ్వాసమని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పుకోవడం అన్యాయమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని