భారాసలో చేరనున్న ఒడిశా మాజీ సీఎం!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, కొరాపుట్ మాజీ ఎంపీ గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్ గమాంగ్లు భాజపాను వీడుతున్నట్లు బుధవారం భువనేశ్వర్లో వెల్లడించారు.
భాజపాకు రాజీనామా చేసిన గిరిధర్ గమాంగ్
రాయగడ పట్టణం, సిమిలిగుడ, న్యూస్టుడే: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, కొరాపుట్ మాజీ ఎంపీ గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్ గమాంగ్లు భాజపాను వీడుతున్నట్లు బుధవారం భువనేశ్వర్లో వెల్లడించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు మీడియాకు వెల్లడించారు. ఇటీవల వీరు హైదరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను కలిశారు. తండ్రీకుమారులు భారాసలో చేరనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ... ‘అవమానభారంతో భాజపాను వీడుతున్నా. స్వచ్ఛందంగా భాజపాలో చేరి, పార్టీ బలోపేతానికి కృషి చేశా. దూషణ, దుష్ప్రవర్తనను కొంతవరకు సహించగలం. అవమానాన్ని భరించడం కష్టం. రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపాం. త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరనున్నాం’ అని పేర్కొన్నారు. గిరిధర్ కొరాపుట్ నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
* భారాసలో చేరనున్నట్లు కొరాపుట్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ జయరామ్ పంగి ‘న్యూస్టుడే’కు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!