దేశంలో ఆంగ్లేయుల కాలం నాటి పరిస్థితులు
దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తే కొందరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.
భాజపా.. కేసీఆర్ ఒక్కటే అని ఈటల మాటల్లో స్పష్టమైంది: రేవంత్
ఈనాడు, హైదరాబాద్: దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ అద్భుతమైన రాజ్యాంగాన్ని తీసుకొస్తే కొందరు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన అనేక హక్కులు, చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు. దేశంలో ఆంగ్లేయుల కాలం నాటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం గాంధీభవన్లో ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్, నాయకులు పొన్నాల లక్ష్మయ్య, చిన్నారెడ్డి, పవన్ ఖేరా, అంజన్కుమార్, మల్లు రవి తదితరులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. తర్వాత విలేకరులతోనూ ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ‘‘ప్రధాని మోదీ ప్రజారంగ సంస్థలను ప్రైవేటుకు విక్రయిస్తున్నారు. తొమ్మిది ప్రభుత్వాలను భాజపా కూలదోసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. ఎమ్మెల్యేలు పార్టీఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దుచేయాలి. అవసరమైతే ఉరి తీసే విధానాన్ని, హత్యలు, అత్యాచారాలకు వేసే కఠిన శిక్షలను అమలు చేయాలి. భాజపాలోనూ కేసీఆర్కు కోవర్టులున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు ఆ పార్టీలోకి వెళ్లాక అర్థమైంది. భాజపా.. కేసీఆర్ ఒక్కటే అన్న విషయం ఈటల మాటల్లో స్పష్టమైంది. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి భాజపాలో చేరినవారు సంతృప్తిగా లేరు. పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో భట్టి మాట్లాడుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేస్తాం. ఎమ్మెల్యేగా పోటీచేయడానికి వయసు 25 ఏళ్ల నుంచి 21కి తగ్గిస్తాం’’ అని రేవంత్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?