ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా చిరంజీవిరావు
శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా విశ్రాంత అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
విశాఖపట్నం (వన్టౌన్), న్యూస్టుడే: శాసనమండలి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా విశ్రాంత అధ్యాపకుడు వేపాడ చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, రావికమతం మండలం, దొండపూడి గ్రామానికి చెందిన చిరంజీవిరావును ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వెల్లడించారు. శనివారం విశాఖ తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పేరును అచ్చెన్నాయుడు ప్రకటించారు. జీవీఎంసీ కార్పొరేటరు గాడు చిన్నికుమారిలక్ష్మిని ఎన్నికల బరిలో దింపుతున్నట్లు గతంలో తెదేపా ప్రకటించింది. అయితే కొంత కాలం నుంచి అభ్యర్థి మార్పుపై తెదేపా వర్గాల్లో జోరుగా చర్చ సాగింది. ఈ క్రమంలో చిన్నికుమారిలక్ష్మి స్థానంలో చిరంజీవిరావును ఎంపిక చేసినట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. స్థానిక తెదేపా నేతలకు చివరి నిమిషం వరకు ఈ సమాచారం లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవిరావు ఎంఏ, బీఈడీ, పీహెచ్డీ చేశారు. సబ్బవరం డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ