చంద్రబాబు వస్తే... మొదట వాలంటీర్ల మీదే తుపాకీ పేలుద్ది: మంత్రి ధర్మాన
‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో... ఏ పార్టీ మంచిదో... చెప్పకూడదని ఎవరన్నారు. ప్రతి పౌరునికి హక్కుంది. వాలంటీరు కూడా ఒక పౌరుడే. మీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే, ప్రచారం చేసే అవకాశంతోపాటు మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కుంది.
గార, న్యూస్టుడే: ‘ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో... ఏ పార్టీ మంచిదో... చెప్పకూడదని ఎవరన్నారు. ప్రతి పౌరునికి హక్కుంది. వాలంటీరు కూడా ఒక పౌరుడే. మీకు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎంచుకునే, ప్రచారం చేసే అవకాశంతోపాటు మంచి కార్యక్రమం గురించి చెప్పే హక్కుంది. మీరు వట్టినే భయపడిపోకూడదు. మీ పరిధిలోని 50 కుటుంబాలపై దృష్టి పెట్టండి. వారందరికీ సౌకర్యవంతమైన జీవనం లభించడానికి కారణం ఏమిటన్నది వివరించాలి. ఒక్క కుటుంబాన్నయినా మార్చండి. పోనీ, చంద్రబాబు వచ్చాడనుకోండి... మొట్టమొదటి ఫైరింగ్ ఎవరిమీద అవుతుంది. ముందు తుపాకీ పేలేది మీ మీదే. ఆయన పేల్చడం ఎందుకు... మనమే ముందు పేల్చేస్తే సరికదా. తుపాకీ మన దగ్గర ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ పంచాయతీలో సోమవారం జరిగిన ‘గడప.. గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.