ప్రతిపక్షాలది బాధ్యతారాహిత్యం
బాధ్యతలేని ప్రతిపక్షాలు పార్లమెంటు జరగకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు.
దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలు
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపాటు
దిల్లీ: బాధ్యతలేని ప్రతిపక్షాలు పార్లమెంటు జరగకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ప్రధాని మోదీకి అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపును తట్టుకోలేక దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు నిరాధార ఆరోపణలకు దిగుతున్నాయని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు రాజ్యసభ ఛైర్మన్ ధన్ఖడ్ను అవమానించారని, సమావేశం ఏర్పాటు చేస్తే రాలేదని విమర్శించారు. బడ్జెట్పై ప్రశంసలు రావడం, మోదీకి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కడం, ఈశాన్య రాష్ట్రాల్లో భాజపా జయకేతనం ఎగరేయడం వంటివి విపక్షాలకు మింగుడుపడటం లేదని, అందుకే సభలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. తొలుత ధన్ఖడ్ ఏర్పాటు చేసిన సమావేశానికి తెదేపా, వైకాపా, బిజూ జనతాదళ్ తప్ప దాదాపుగా మిగిలిన విపక్ష పార్టీలన్నీ గైర్హాజరయ్యాయని వివరించారు. ఆ తర్వాత రెండోసారి ఏర్పాటు చేసిన సమావేశానికి ఛైర్మన్ వ్యక్తిగత విజ్ఞప్తి మేరకు తృణమూల్, డీఎంకే హాజరయ్యాయని, అప్పుడూ మిగిలిన పార్టీలు రాలేదని తెలిపారు.
ఖర్గేను అడ్డుకున్నదెవరు: కాంగ్రెస్
గోయల్ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. రాజ్యసభలో ఖర్గే మాట్లాడటానికి ఛైర్మన్ అనుమతించినా భాజపా సభ్యులే అడ్డుకుని గందరగోళం సృష్టించారని ధ్వజమెత్తారు. ‘ఛైర్మన్ సమావేశానికి ఆహ్వానిస్తే రాలేదని మమ్మల్ని గోయల్ తప్పుబడుతున్నారు. వాస్తవానికి ఆయనే సభా నాయకుడిగా ఉండీ.. ఖర్గే మాట్లాడేందుకు ఛైర్మన్ అవకాశమిచ్చినా మాట్లాడనివ్వకుండా భాజపా సభ్యులు గందరగోళం సృష్టిస్తుంటే అడ్డుకోలేదు’ అని విమర్శించారు.
రూ.1.48 లక్షల కోట్ల అదనపు అనుబంధ పద్దులకు ఆమోదం
2022-23లో ఖర్చు చేయనున్న రూ.1.48 లక్షల కోట్ల అదనపు అనుబంధ పద్దులకు లోక్సభ మంగళవారం ఆమోదం తెలిపింది. అదానీ అంశంపై గందరగోళం కొనసాగుతున్న సమయంలోనే ఈ పద్దులకు ఆమోదం లభించింది.
జమ్మూ కశ్మీర్ బడ్జెట్కూ..
కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ బడ్జెట్ను లోక్సభ మంగళవారం ఆమోదించింది. 2023-24 సంవత్సరానికిగానూ 1.18 లక్షల కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్కు గందరగోళం మధ్యే లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తరఫున సహాయ మంత్రి పంకజ్ చౌధరి ప్రవేశపెట్టారు.
స్పీకర్ భేటీలోనూ కుదరని సయోధ్య
లోక్సభ వాయిదాల పర్వానికి ముగింపు పలికేందుకు స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సమావేశమూ ఎలాంటి ఫలితమివ్వలేదు. జేపీసీ వేయాల్సిందేనన్న తమ డిమాండును వీడేది లేదని కాంగ్రెస్, మిగిలిన ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. రాహుల్ను సభలో మాట్లాడనివ్వాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి కోరారు. రాహుల్ క్షమాపణ చెప్పాల్సిందేనని భాజపా డిమాండు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం