హైదరాబాద్‌కు ఠాక్రే.. రేవంత్‌తో భేటీ

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరీలతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు.

Published : 24 Mar 2023 04:08 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరీలతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రపై రేవంత్‌తో చర్చించారు. పీసీసీ నేతల పాదయాత్రల తీరుపై ఆరా తీశారు. పెండింగ్‌లో ఉన్న డీసీసీ అధ్యక్షులు, ఇతర పదవులపై, రాష్ట్రంలో తాజా రాజకీయాలు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై కూడా చర్చ జరిగింది. పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత  భట్టి విక్రమార్కతోనూ ఠాక్రే జూమ్‌లో మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని