రూ.2 వేల కోట్ల ప్రజాధనం వృథా
ముఖ్యమంత్రి జగన్రెడ్డి అసమర్థతతోనే పోలవరం డయాఫ్రంవాల్ మరమ్మతులకు రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్రెడ్డి అసమర్థతతోనే పోలవరం డయాఫ్రంవాల్ మరమ్మతులకు రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతోందని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైకాపా అధికారం చేపట్టాక పోలవరం ప్రాజెక్టు పనుల్ని 15 నెలలు జాప్యం చేయడం కారణంగానే వరదల వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్ నియమించిన హైదరాబాద్ నిపుణుల కమిటీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ‘రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి జగన్రెడ్డి పోలవరం నిర్మాణ పనుల్ని జాప్యం చేశారు. గత కాంట్రాక్టర్నే కొనసాగించి ఉంటే 2020లోపే పోలవరం పూర్తి అయ్యేది. పనులు ముమ్మరంగా చేస్తున్న కాంట్రాక్టర్ను మార్చొద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినలేదు. 5 ఏళ్లలో తెదేపా ప్రభుత్వం 71% పనుల్ని పూర్తి చేస్తే నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం 7% పూర్తి చేసింది. సమయం ఉన్నా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టులో తీవ్ర సమస్య ఏర్పడింది. ఇప్పుడు వారి తప్పులను గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం పూర్తయి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు సస్యశ్యామలం కావడం జగన్కు ఇష్టం లేదు. అందుకే ప్రాజెక్టు పూర్తికి అడుగు ముందుకు వేయడం లేదు. డీపీఆర్-2ను ఆమోదించమని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ఎత్తిపోతల పథకంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?