ఉద్యోగ నియామకాల్లో అక్రమాలపై అధ్యయనం
రాష్ట్రంలో 2014 నుంచి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు ప్రశ్నపత్రాల లీకేజీపై ఏర్పాటైన భాజపా టాస్క్ఫోర్స్ కమిటీ ప్రకటించింది.
భాజపా టాస్క్ఫోర్స్ కమిటీ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2014 నుంచి చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు ప్రశ్నపత్రాల లీకేజీపై ఏర్పాటైన భాజపా టాస్క్ఫోర్స్ కమిటీ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ సహా రాష్ట్రంలో ఇతర ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించి న్యాయపోరాటం చేయాలని సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్ అధ్యక్షతన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశమైంది. సభ్యులు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు కరుణాగోపాల్ పాల్గొన్నారు. సింగరేణి కొలువుల్లో అక్రమాలు జరిగాయనే అంశంపై అక్కడ పర్యటించి సమాచారం సేకరించనున్నట్లు కమిటీ తెలిపింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో పర్యటించి ప్రశ్నపత్రాల లీకేజీపై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోనున్నట్లు పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం