తెదేపా నాయకులపై బలవంతంగా తప్పుడు కేసులు పెట్టించారు
వైకాపా నాయకులు నన్ను బలవంతం చేసి తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త దామోదర్రెడ్డి మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వైకాపా కార్యకర్త ఆడియో
ఏర్పేడు, న్యూస్టుడే: వైకాపా నాయకులు నన్ను బలవంతం చేసి తెదేపా నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాతవీరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త దామోదర్రెడ్డి మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏర్పేడు జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దామోదర్రెడ్డి, మరో వ్యక్తి ఫిర్యాదుతో తెదేపా నేతలపై ఏర్పేడు పోలీసులు ఎస్సీ, ఎస్టీ, దాడి కేసులు నమోదు చేశారు. దీంతో తెదేపా నేతలు రహస్య ప్రాంతాల్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో దామోదర్రెడ్డి ఓ తెదేపా నాయకుడితో సెల్ఫోన్లో మాట్లాడుతూ ‘నా చొక్కా చించుకుని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైకాపా నేతలు నటించమన్నారు. వారు చెప్పినట్లుగానే చేశా. చేసిన తప్పుకు బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. అనవసరంగా తప్పుడు కేసులు పెట్టించామని మా కుటుంబమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది’ అంటూ సుమారు ఐదు నిమిషాలకు పైగా ఆయన మాట్లాడిన ఆడియో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.