DK Shivakumar - Siddaramaiah: ఎవరు ముఖ్యమంత్రి?
సార్.. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి మీరేనంట కదా? అని ఎవరైనా డీకే శివకుమార్ను అడిగితే ముందు పార్టీ గెలవనివ్వండి.. ఆపై తేల్చుకుందామనేవారు.
సిద్ధు, శివల పోటాపోటీ
ఈనాడు - బెంగళూరు
సార్.. కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి మీరేనంట కదా? అని ఎవరైనా డీకే శివకుమార్ను అడిగితే ముందు పార్టీ గెలవనివ్వండి.. ఆపై తేల్చుకుందామనేవారు. ఇదే ప్రశ్న సిద్ధరామయ్యకు వేస్తే.. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే శాసనసభా పక్ష సమావేశంలో గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారనేవారు. సరిగ్గా ఆ సమయం రానే వచ్చింది. ఆదివారం సాయంత్రం బెంగళూరులో శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో చర్చించేది ఈ ఇద్దరి గురించే.
‘కనకపుర బండ’గా అభిమానులు పిలిచే 62 ఏళ్ల డీకే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్కు వేగాన్ని అందించిన నేత. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన డీకే 2017 వరకు ఓ సాధారణ నాయకుడే. ఆ ఏడాది ఆగస్టులో గుజరాత్కు చెందిన అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేలకు బెంగళూరులో విడిది ఏర్పాటు చేసి అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. అదే సందర్భంగా అక్రమ నగదును బదిలీ చేస్తున్నారని ఈడీ దృష్టిలో పడిన డీకేను ఇప్పటికీ ఆ కేసులు వెంబడిస్తున్నాయి. ఇదే కేసుల్లో తిహాడ్ జైలుకూ వెళ్లాల్సి వచ్చింది. సోనియా గాంధీ తనపై చూపిన అభిమానాన్ని శనివారం ఎన్నికల ఫలితాల తర్వాత తలచుకుని కన్నీటి పర్యంతమైన డీకేకు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చినట్లే ముఖ్యమంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదు. 1989లో 27 ఏళ్లకే ఎమ్మెల్యే అయిన డీకే.. ఇప్పటివరకు ఓటమి ఎరుగరు. తాజా ఎన్నికల్లో 1.20 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించారు.
బలం: యువ నాయకత్వానికి ప్రతినిధి. ఏఐసీసీ అధ్యక్షుడు, రాహుల్, సోనియా గాంధీల అండదండలున్నాయి. పార్టీకి అపారమైన ఆర్ధిక వనరులు సమకూర్చగలరు.
బలహీనత: బెంగళూరుకే పరిమితమైన నేత. కోపం ఎక్కువ. అందరితో కలిసిపోయే తత్వం తక్కువ. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే సీనియర్ల నుంచి సహకారం అంతంత మాత్రమే.
సిద్ధరామయ్య.. రాష్ట్ర రాజకీయాల్లో అపారమైన అభిమానులన్న నేతల్లో ప్రముఖుడు. దేవరాజ్ అరసు తర్వాత ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసింది సిద్ధరామయ్యే. అహింద (బలహీనవర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే ఆయన జనతా పరివార్ నుంచి 2006లో కాంగ్రెస్లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగా ఆకళింపు చేసుకున్నారు. జనతాదళ్లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకు అత్యధిక సార్లు (13సార్లు) బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత సొంతం చేసుకున్నారు. మాట కఠినంగా ఉన్నా అభిమానుల మనసులు గెలిచిన ఆయనపై అవినీతి ఆరోపణలు తక్కువే. 2013లో కాంగ్రెస్కు 122 స్థానాల విజయాన్ని అందించడంలో సిద్ధరామయ్య పాత్రను విస్మరించని అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ఉండేందుకు అంగీకరించింది. అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయని ఆయన ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాలను అందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పట్టున్న నేత.
బలం: అపార రాజకీయ అనుభవం, పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడపగలరు. అధిష్ఠానం సిద్ధరామయ్య నిర్ణయాన్ని కాదనలేదు.
బలహీనత: ఏఐసీసీ అధ్యక్షుడి సహకారం తక్కువే. కొత్త తరం నాయకులకు మింగుడు పడని నేత. ఆధునిక రాజకీయాలు, వ్యూహాలకు దూరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..