దేశ మనోభావాలను అవమానించారు
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షం బహిష్కరించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిసారిగా తప్పుపట్టారు.
పార్లమెంటు ప్రారంభాన్ని విపక్షాలు బహిష్కరించడంపై ప్రధాని మోదీ
అజ్మేర్: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవాన్ని ప్రతిపక్షం బహిష్కరించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తొలిసారిగా తప్పుపట్టారు. తమ చర్య ద్వారా కాంగ్రెస్.. దేశ, పార్లమెంటు భవనాన్ని నిర్మించిన 60 వేల మంది కార్మికుల మనోభావాలను అవమానించింది. ‘‘మూడు రోజుల క్రితం మనదేశం పార్లమెంటు కొత్త భవనాన్ని ఆవిష్కరించుకుంది. ఇది మీకు గర్వకారణమా? కాదా? దేశ గౌరవం ఇనుమడించడంపై ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారా? వీటిపైనా కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు రాజకీయ బురదను చల్లాయి’’ అని రాజస్థాన్లోని అజ్మేర్లో జరిగిన భాజపా బహిరంగ ర్యాలీలో మోదీ విమర్శించారు. పార్లమెంటు భవనం ఆవిష్కరణ వంటి అవకాశాలు కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని..అయితే దీనిని కాంగ్రెస్ తన స్వార్థ నిరసన కోసం ఉపయోగించుకుంది అని మోదీ ఆక్షేపించారు. దేశం సాధిస్తున్న పురోగతిని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. పేదవాడి కుమారుడినైన తాను కాంగ్రెస్ అవినీతిని, వారి కుటుంబ రాజకీయాలను ప్రశ్నిస్తున్నందున, వారి ఇష్టానుసారం వ్యవహరించకుండా అడ్డుకుంటున్నందుకు ఆ పార్టీ ఆగ్రహంతో ఉందని తెలిపారు. అంతకు ముందు తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అజ్మేర్ జిల్లాలోని పుష్కర్లో గల ప్రసిద్ధ బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం