గాలిలో దీపంగా యువత భవిత!

రాష్ట్ర యువత భవిత గాలిలో దీపంగా మారిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇంగ్లీష్‌ బానిస మనస్తత్వాన్ని తిరిగి పసిబిడ్డల లేత మనస్సుల్లో జోప్పించడమే ‘ఎజెండా’గా పెట్టుకున్న ‘అభినవ మెకాలే’ జగన్‌ పాలనలో యువతకు భవిష్యత్తు లేకుండాపోతోంది.

Published : 07 Jun 2023 04:24 IST

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు-అమరావతి : రాష్ట్ర యువత భవిత గాలిలో దీపంగా మారిందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి.. ఇంగ్లీష్‌ బానిస మనస్తత్వాన్ని తిరిగి పసిబిడ్డల లేత మనస్సుల్లో జోప్పించడమే ‘ఎజెండా’గా పెట్టుకున్న ‘అభినవ మెకాలే’ జగన్‌ పాలనలో యువతకు భవిష్యత్తు లేకుండాపోతోంది. జాతీయ విద్యా సంస్థల స్థానాల్లో (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌) ఏపీకి చెందిన ప్రభుత్వ విద్యాలయాల ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. ప్రతిష్ఠాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం ర్యాంకు కూడా పడిపోవడం దారుణం. విద్యా ప్రమాణాలు పెంచే మేధావులను కాకుండా...రాజకీయ తొత్తులుగా పనిచేసే ‘జోకర్ల’ను వీసీలు నియమించడమే ప్రస్తుత దుస్థితికి కారణం...’’ అని పేర్కొంటూ మంగళవారం ఆయన ట్వీట్‌ చేశారు. దీనికి ‘ఈనాడు’లో విశ్వవిద్యాలయాలకు వచ్చిన ర్యాంకుల కథనాన్ని జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని