YVB Rajendra Prasad: తెదేపా నేత వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు గుండెపోటు

తెదేపా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు.

Updated : 07 Jun 2023 11:41 IST

విజయవాడ: తెదేపా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స కొనసాగుతోంది. రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. యాంజియోగ్రామ్‌ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఫోన్‌లో చంద్రబాబు పరామర్శ

వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆయనకు సూచించారు. వైద్యులతోనూ మాట్లాడి రాజేంద్ర ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణహాని లేదని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని