Mynampally Hanumanth Rao: మైనంపల్లిని మార్చేద్దాం!
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భారాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం.
నిర్ణయానికి వచ్చిన భారాస అధిష్ఠానం
మల్కాజిగిరి నుంచి మూడు పేర్లు పరిశీలనలో..
హరీశ్పై వ్యాఖ్యల పర్యవసానం
ఈనాడు - హైదరాబాద్
మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన మైనంపల్లి హన్మంతరావు స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని భారాస అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎవరనే విషయంలో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్టు సమాచారం. మల్కాజిగిరి సీటు తనకు కేటాయించడంతోపాటు మెదక్ నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని, లేకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తామని హన్మంతరావు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి హరీశ్రావుపైనా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి కొద్ది సమయానికి ముందు ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీరా అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన పేరు ఉండటంతో ఇదే విషయాన్ని విలేకరులు సీఎం వద్ద ప్రస్తావించారు. ‘టికెట్ కేటాయించాం. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలా? లేదా అనేది ఆయన ఇష్టం’ అని సీఎం వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తదితరులు మైనంపల్లి వ్యాఖ్యలను ఖండించారు.
స్పష్టత ఇచ్చినా పట్టుపట్టడంతో...
గత కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానంలో మైనంపల్లి కుమారుడు రోహిత్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రోహిత్కే మెదక్ టికెట్ ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెదక్ నుంచి పద్మా దేవేందర్రెడ్డే మళ్లీ పోటీ చేస్తారని పార్టీ స్పష్టత ఇచ్చింది. స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా మైనంపల్లి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తామని పేర్కొనడం, హరీశ్రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని సీరియస్గా పరిగణించిన పార్టీ అధిష్ఠానం మల్కాజిగిరి నుంచి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు మరో రెండు పేర్లు వినిపిస్తున్నా, అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయో అంచనాకు వచ్చిన తర్వాత నిర్ణయం వెల్లడించనున్నట్టు తెలిసింది.
కాంగ్రెస్ నేతల మంతనాలు
మరోవైపు మైనంపల్లితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్లో ఇప్పటికే ఉన్నవారికి, సీనియర్ నాయకులకు కూడా కుటుంబంలో రెండు టిక్కెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆసక్తి చూపడం లేదు. గత ఎన్నికల్లో అనివార్య పరిస్థితుల్లో ఉత్తమ్కుమార్రెడ్డి దంపతులకు మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మైనంపల్లి పయనం ఎటువైపో అనేది చర్చనీయాంశంగా మారింది.
కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా: మైనంపల్లి
తిరుమల, న్యూస్టుడే: తనను నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఉన్నారని, హైదరాబాద్ వెళ్లాక వారితో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మరోమారు శ్రీవారిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘సోమవారం శ్రీవారి సన్నిధిలో నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పా. హైదరాబాద్ వెళ్లాక మెదక్, మల్కాజిగిరి ప్రజలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. మాకు ప్రజల మద్దతు ఉంది. నాకు, నా కుమారుడికి టికెట్లు ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదు.. కొనుక్కున్నాం
పల్నాడు జిల్లా ముప్పాళ్ల జడ్పీటీసీ పదవి ఊరికే రాలేదని.. ఎంతో ఖర్చుపెట్టి కొనుక్కుంటే ఆ పదవి వచ్చిందని దమ్మాలపాడు గ్రామానికి చెందిన శిరిగిరి గోపాలరావు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు చర్చనీయాంశమైంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు నలుగురి నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
ప్రభుత్వ అలసత్వం వల్లే వృద్ధులకు పింఛను కష్టాలు
నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దే పింఛన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాంకుల్లో జమ చేసి, వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు