Congress - BRS: ఒకటికి ఎక్కువ.. రెండుకు తక్కువ!
రాజ్యసభ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చాలీచాలని బలం
ఏకగ్రీవానికే మొగ్గు.. కాంగ్రెస్కు 2, భారాసకు ఒకటి దక్కే అవకాశం
ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్, లింగయ్య, రవిచంద్రల పదవీకాలం
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు (Rajya Sabha elections) జరగనున్నాయి. రాష్ట్రానికి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్ల పదవీకాలం వచ్చే ఏప్రిల్ రెండో తేదీన ముగియనుంది. ఈ మూడు స్థానాలకు మార్చి నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించనుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా ఓటింగులో పాల్గొని రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉండగా.. ప్రతి 39.6 సభ్యులకొకరు చొప్పున ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పూర్తి కోటాతో ఏ పార్టీ కూడా రెండు గానీ, మూడు గానీ సీట్లు గెలిచే అవకాశం లేదు. అధికార పార్టీ కాంగ్రెస్ (Congress), ప్రధాన ప్రతిపక్షమైన భారాసలకు (BRS) మిత్రపక్షాలతో కలిసినా.. ఒక సీటుకు సరిపడా మాత్రమే ఓట్లున్నాయి. రెండో సీటుకు మెజారిటీ చాలదు. దీంతో అవి తమకున్న బలాల మేరకే అభ్యర్థులను నిలిపే అవకాశం ఉంది.
- ప్రస్తుత ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్కు 64 మంది, దాని మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, భారాస 39, భాజపా 8, మజ్లిస్కు ఏడుగురు సభ్యుల బలం ఉంది.
- నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం.. కాంగ్రెస్ తన బలంతో ఒక సీటును గెలుచుకున్నాక.. ఆ పార్టీకి సీపీఐతో కలిపి మరో 25 ఓట్లు ఉంటాయి. అంటే రెండో స్థానంలో 40 ఓట్లు సాధించడం కష్టమే. మరోవైపు భారాసకు 39 ఓట్లు మాత్రమే ఉన్నాయి. దాని మిత్రపక్షమైన మజ్లిస్కు గల ఏడు స్థానాలు కలిస్తే మొత్తం 46 అవుతాయి. అంటే ఒక సీటు గెలిచాక.. మిగిలేవి ఆరు ఓట్లు. 40 ఓట్ల కోటాతో రెండో స్థానంలో అది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు.
పోటీ ఎలా ఉంటుంది?
రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే.. పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.
- ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగు అనివార్యమవుతుంది. అప్పుడు మొదటి మూడు స్థానాల్లో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు.
- కాంగ్రెస్కు ఒక స్థానం గెలిచే ఓట్ల కంటే మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది.
- భారాసకు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండోస్థానానికి పోటీ చేసే వీలు ఉండదు.
- ఈ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ రెండు, భారాస ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి. కాంగ్రెస్, భారాస మినహా మిగిలిన పార్టీలకు పోటీ పడేంత బలం లేదు.
కాంగ్రెస్ మూడింటికి పోటీ చేస్తే..
కాంగ్రెస్ మూడు స్థానాలకు పోటీ చేసినా.. భారాస రెండు స్థానాలకు పోటీ చేసినా ఎన్నికలు ఉత్కంఠగా మారుతాయి. కాంగ్రెస్కు ముగ్గురు అభ్యర్థులు ఉంటే అప్పుడు ఆ పార్టీ ఒక్కో అభ్యర్థికి ఓట్ల బలం 21.6 ఉంటుంది. కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే భారాస, మిత్రపక్షం మజ్లిస్తో కలిసి పోటీ చేయడానికి సాహసిస్తుంది. అప్పుడు వాటి బలం 46 అవుతుంది. అంటే దానికి రెండు స్థానాల్లో 23 చొప్పున ఓట్లు ఉంటాయి. అది కాంగ్రెస్ అభ్యర్థుల సగటు ఓట్ల కంటే ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్, భారాసలు తమ బలానికి తగ్గట్లుగా అభ్యర్థులను నిలిపి ఏకగ్రీవంగా గెలిపించుకోవడానికే మొగ్గు చూపే వీలుంది.
ఆశావహులెందరో..
రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్, భారాసలో భారీ సంఖ్యలో ఆశావహులున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పలువురికి హామీలిచ్చిన నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేస్తుందో వేచి చూడాలి. భారాసలో సైతం పార్టీ ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు