Botsa Satyanarayana: బొత్స కోటకు బీటలు!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపా కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కోటకు బీటలు వారుతున్నాయి.
తెదేపాలోకి భారీగా వలసలు
తిరిగి సైకిల్ ఎక్కిన గద్దే బాబూరావు
అదే బాటలో పలువురు నేతలు
ఈనాడు- విజయనగరం, న్యూస్టుడే, గరివిడి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైకాపా కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ కోటకు బీటలు వారుతున్నాయి. తెదేపాలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. బలమైన నేతలు వరుస కడుతుండడం వైకాపావర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. మంత్రి బొత్సకు పెట్టనికోటగా.. ఆయన గెలుపునకు బాసటగా నిలుస్తున్న మెరకముడిదాం మండలంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఇద్దరు ప్రముఖులు తెదేపాలో చేరడంతో ఆ కోట బలహీనపడుతున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, విజయనగరం జిల్లా వయోజన విద్యా శాఖ ఉప సంచాలకుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కోట్ల సుగుణాకరరావు మంగళగిరిలోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆ పార్టీ అగ్రనాయకుల సమక్షంలో పసుపు కండువా కప్పుకొన్నారు. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా బాబూరావు రెండుసార్లు గెలుపొందారు. సుగుణాకరరావు తండ్రి కోట్ల సన్యాసప్పలనాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇదే స్థానం నుంచి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
ఆ తర్వాత జరిగిన మార్పుల్లో రాజకీయంగా ఎదిగిన బొత్స కుటుంబంతో కోట్ల కుటుంబానికి రాజకీయ అనుబంధం పెరిగింది. ఈ కుటుంబానికి చెందిన నాయకులు మెరకముడిదాం మండల జడ్పీటీసీ సభ్యులుగా, మండలాధ్యక్షులుగా పనిచేశారు. ఇదే మండల నేత, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ ఎస్వీ రమణరాజు స్వగ్రామం సోమలింగాపురంలో ఇటీవల వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి శిరువూరి కృష్ణమూర్తిరాజు, శిరువూరి వెంకటపతిరాజు వంటి కీలక నేతలు వైకాపాను వీడారు. పెద్ద ఎత్తున తమ అనుచరగణంతో తెదేపాలో చేరారు. వైకాపా పెద్దలు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ వారు సైకిల్ ఎక్కకుండా అడ్డుకోలేకపోయారు. నియోజకవర్గంలో మంత్రి బొత్సకు కంచుకోటగా ఉన్న ఇదే మండలం పెదపూతికవలసలో వైకాపాలో ఒక వర్గం ఇటీవల తెదేపాలో చేరింది. ఇంత వరకు అక్కడ తెదేపా జెండా పట్టుకునే కార్యకర్త లేని పరిస్థితి. ఇప్పుడు అధికార పక్షంతో నువ్వా.. నేనా.. అనే రీతిలో ఢీకొనే స్థాయికి చేరింది. గుర్ల మండలం గూడేంలో వైకాపా నుంచి ఒక వర్గం ఆ పార్టీని వీడి తెదేపా తీర్థం పుచ్చుకుంది.
వరుస చేరికలతో ఉత్సాహం..
మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు చేరికతో తెదేపాకు మరింత ఊపు వచ్చినట్లయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత కావడంతో చీపురుపల్లిలో పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉత్తరాంధ్ర తెదేపాలో గద్దే చక్రం తిప్పారు. తెదేపా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, ప్రభుత్వ విప్గా పనిచేశారు. 1994, 1999లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెరకముడిదాం మండలం చినబంటుపల్లికి చెందిన కోట్ల సుగుణాకరరావు తెదేపా జెండా పట్టడం ఆ మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. ఈయనకు జిల్లా వ్యాప్తంగా బంధుత్వాలు, విస్తృత పరిచయాలు ఉన్నాయి. సుగుణాకరరావు బాటలోనే మెరకముడిదాం మండలం నుంచి మరికొందరు కీలక నేతలు తెదేపా వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!