నాడు గౌరవం.. నేడు అగౌరవం..: చర్చనీయాంశమైన బుద్ధా వెంకన్న ట్వీట్‌

‘కోవర్టు అని తెలియక చంద్రబాబు నీకు ఆ రోజు ఇచ్చిన గౌరవం.. నువ్వు కోవర్టు అని తెలుసు కాబట్టి జగన్‌రెడ్డి నీకు ఇచ్చిన అగౌరవం ఇది..!’ అంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న..

Updated : 21 Jan 2024 07:38 IST

ఈనాడు, అమరావతి: ‘కోవర్టు అని తెలియక చంద్రబాబు నీకు ఆ రోజు ఇచ్చిన గౌరవం.. నువ్వు కోవర్టు అని తెలుసు కాబట్టి జగన్‌రెడ్డి నీకు ఇచ్చిన అగౌరవం ఇది..!’ అంటూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ఇటీవల చంద్రబాబు దంపతులు దుర్గగుడి దర్శనానికి వచ్చిన సందర్భంగా ఎంపీ కేశినేని నానికి ఆయన నమస్కరించి, వెంటబెట్టుకుని నడిచారు. పార్టీ మారి వైకాపాలో చేరిన తర్వాత శుక్రవారం విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు వచ్చిన సీఎం జగన్‌కు ఎంపీ కేశినేని రెండు చేతులతో నమస్కరిస్తున్నా.. కనీసం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఈ రెండు వీడియోలను బుద్దా వెంకన్న ట్వీట్‌కు జతచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు