హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు.
ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ ధ్వజం
ఈనాడు, బెంగళూరు, చెన్నై- న్యూస్టుడే-కోయంబత్తూరు: దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కర్ణాటకలోని శివమొగ్గలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. శక్తి ముసుగులో అధికారం కోసం మోదీ ప్రయత్నిస్తున్నారని ముంబయిలో ఆదివారం భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్గాంధీ చేసిన ఆరోపణలకు మోదీ బదులిచ్చారు. దేశం నుంచి ఆంగ్లేయులు వెళ్లిపోయినా వారి భావజాలం ఇంకా కాంగ్రెస్లో ఉందని ప్రధాని విమర్శించారు.
ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం రోడ్షోలో పాల్గొన్నారు. కేంద్ర సహాయమంత్రి ఎల్.మురుగన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి ఓపెన్టాప్ జీపు నుంచి కార్యకర్తలకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.
తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టం!
ఈనాడు, కరీంనగర్: తెలంగాణను దోచుకున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ ఇచ్చే గ్యారంటీ అని తెలిపారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు. పదేళ్ల పాలనలో భారాస రాష్ట్రాన్ని దోచుకుందని.. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము దిల్లీ చేరుతోందని ధ్వజమెత్తారు. దోపిడీదారులు.. ఇతర దోపిడీదారుల అవినీతిని ప్రశ్నించలేరని.. ఎన్నికల సమయంలో భారాస కుంభకోణాలపై మాట్లాడిన కాంగ్రెస్ ఇప్పుడు వాటిపై నోరుమెదపడం లేదన్నారు. కాంగ్రెస్, భారాసలు ఒకర్ని ఒకరు కాపాడుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ తప్పుల్ని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. భాజపాకు 400కుపైనే సీట్లు వస్తాయని.. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి తాను గ్యారంటీ అని ప్రకటించారు. జూన్ 2 నాటికి తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుందని.. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని, వచ్చే దశాబ్దంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్