Vizianagaram: ‘కోలగట్ల ఓ వడ్డీకాసులవాడు’
డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గురించి ‘స్వామివారి సూపర్హిట్ రాజకీయ లీలలు’ కథలు కథలుగా చెప్పుకోవచ్చని, ఆయన అవినీతి, అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తామని వైకాపా నేత, కో-ఆపరేటివ్ అర్బన్బ్యాంకు మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు.
ఆయన అవినీతిని నిరూపిస్తా
వైకాపా నేత గౌరీశంకర్
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గురించి ‘స్వామివారి సూపర్హిట్ రాజకీయ లీలలు’ కథలు కథలుగా చెప్పుకోవచ్చని, ఆయన అవినీతి, అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తామని వైకాపా నేత, కో-ఆపరేటివ్ అర్బన్బ్యాంకు మాజీ అధ్యక్షుడు కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు. మంగళవారం విజయనగరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోలగట్ల అవినీతిని నిరూపిస్తే.. ఆయన పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. నగరంలో వడ్డీకాసుల వాడంటే ఎమ్మెల్యే అని అందరికీ తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. లేఅవుట్లకు ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు కావాలంటే స్వామివారి దర్శనం చేసుకుని, అక్కడ ఉండే కౌంటర్ 1, 2లను కలిస్తే వారు చెప్పినట్లు ఆ స్వామివారి చిట్స్ కంపెనీలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చిట్స్ కట్టాల్సిందేనన్నారు. అతని అల్లుడికీ వాటా ఇవ్వాలని, లేకపోతే అనుమతులు రావన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ ఫీజులు కాకుండా అదనంగా ఇచ్చే ముడుపులు నేరుగా ఆయనకు చేరుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యే నిధులతో ఏ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. నగరపాలక సంస్థ నిధులతో చేస్తే ఎమ్మెల్యే అభివృద్ధి చేశారని చెప్పుకొంటున్నారన్నారు. తెదేపా హయాంలోనే నగరంలో రోడ్లవిస్తరణ జరిగిందని, కొంతమేరకు మిగిలిన పనులకు రంగులు, దీపాలు ఏర్పాటుచేసి తాను చేసినట్లు చెప్పుకొంటున్నారన్నారు. ఎమ్మెల్యే అరాచకాలను ఒక్కొక్కొటిగా బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!