బీఎస్పీలోకి మందా జగన్నాథం

మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

Published : 18 Apr 2024 04:05 IST

అలంపూర్‌, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ అధినాయకురాలు మాయావతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఆయన చేరారు. జగన్నాథం గతంలో నాలుగు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. ఈసారి బహుజనుల సహకారంతో నాగర్‌కర్నూల్‌ ఎంపీగా ఎన్నికై రావాలని మాయావతి శుభాకాంక్షలు తెలిపినట్లు ఆయన సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని